Friday, May 10, 2024
Homeandhra pradeshTirumala Opearation Chirutha : తిరుమలలో ఆపరేషన్ చిరుత.. బోనులో చిక్కిన ఐదో చిరుత

Tirumala Opearation Chirutha : తిరుమలలో ఆపరేషన్ చిరుత.. బోనులో చిక్కిన ఐదో చిరుత

Telugu Flash News

Tirumala Opearation Chirutha: తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌ చిరుతకు మంచి ఫలితం వచ్చింది. తాజాగా మరో చిరుత పులి బోనులో చిక్కుకుంది. నరసింహ ఆలయంలోని ఏడో మైలురాయి సమీపంలో చిరుతపులి ఉచ్చులో చిక్కుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ట్రాప్ కెమెరాల్లో దాని కదలికను అధికారులు గుర్తించి బోనును ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి ఉచ్చులో చిక్కుకుంది.. ఈ చిరుతతో పాటు రెండు నెలల్లో మొత్తం ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ చేతికర్రలను పంపిణీ చేసింది.

Tirumala News : తిరుమల నడక దారి లో భక్తులకు చేతికర్రల పంపిణీ

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News