Wednesday, May 8, 2024
HomenationalViral video : ప్రియాంక గాంధీ దోశలు వేశారు.. వీడియో వైరల్

Viral video : ప్రియాంక గాంధీ దోశలు వేశారు.. వీడియో వైరల్

Telugu Flash News

Priyanka Gandhi Viral video : కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై మాటల దాడితో ప్రచారం ఊపందుకుంది.

ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అగ్రనేతలు రంగంలోకి దిగి రాష్ట్రంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలు ప్రచార సభల్లో పాల్గొని కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం మైసూరులో ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే అక్కడి ఓ హోటల్‌కు వెళ్లి తానే స్వయంగా దోశలు వేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

-Advertisement-

కర్ణాటకలో ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

మే 10న ఎన్నికలు నిర్వహించి.. అదే నెల 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్ కు 75, జేడీఎస్ కు 28.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

మరిన్ని నేషనల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి . 

మరిన్ని వైరల్ వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి . 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News