Saturday, May 11, 2024
HomesportsMS Dhoni : విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

MS Dhoni : విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

Telugu Flash News

MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్యాండీ క్రష్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ గేమ్ పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడతారు. ధోనీ కూడా అలాంటి ఆటే ఆడుతున్నట్లుగా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇండిగో విమానంలో ధోనీ ప్రయాణిస్తుండగా.. ఎయిర్ హోస్టెస్ అతడికి చాక్లెట్లు, స్వీట్లు తీసుకొచ్చింది. అప్పటి వరకు ధోని తన ట్యాబ్‌పై క్యాండీ క్రష్‌ ఆడాడు. ఎయిర్ హోస్టెస్ వస్తున్న సంగతి గమనించిన ధోని, తను ఆడుతున్న ఆటను పక్కన పెట్టాడు. చాక్లెట్లు తీసుకోమని అడిగితే చిరునవ్వుతో ప్యాకెట్ తీసుకున్నాడు. ఆ సమయంలో ధోనీ భార్య సాక్షి అక్కడే ఉన్నారు.

MS Dhoni playing candy crushదీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, క్యాండీ క్రష్ గేమ్ డౌన్‌లోడ్‌లు భారీగా పెరిగాయి. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, క్యాండీ క్రష్ గేమ్ మూడు గంటల్లో 3.6 మిలియన్ డౌన్‌లోడ్‌లను పొందింది. ధోనీ వీడియోను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. క్యాండీ క్రష్‌కి భారీగా డౌన్‌లోడ్‌లు వస్తున్నాయని, ధోనీకి ధన్యవాదాలు అని ఓ నెటిజన్ సరదాగా అన్నాడు.

read more news :

Uppal Skywalk : ఉప్పల్ స్కై వాక్ వీడియో చూశారా ? ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

Drugs Case : టాలీవుడ్ లో కలకలం.. స్పందించిన ఆషూ రెడ్డి, జ్యోతి, సురేఖావాణి

-Advertisement-

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News