Hometelanganaమంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. తాజా సమాచారం ఏంటంటే ?

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. తాజా సమాచారం ఏంటంటే ?

Telugu Flash News

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (minister malla reddy) పై ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా కోట్లాది రూపాయల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ల్యాప్‌టాప్ కేసు, ఐటీ అధికారుల దాడి ఘటనను ఐటీ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటి వరకు జరిపిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనున్నారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, ఆధారాలను ఈడీకి వెల్లడిస్తామన్నారు. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ కూడా జరగాలని ఐటీ భావిస్తోంది. ఇదే జరిగితే మల్లారెడ్డి ఉచ్చు మరింత బిగుసుకుంది. ఆయనపై ఈడీ దాడులు కూడా చేసే అవకాశం ఉంది.

also read news:

Health benefits of Dry Fruits : ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్

Surya Kumar Yadav: బంగ్లాదేశ్ పర్యటనకు సూర్య ఎంపికపై బీసీసీఐ వివక్ష ? అభిమానుల ఆగ్రహం..

 

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News