Monday, May 13, 2024
HomeSpecial StoriesMary Celeste : మేరి సెలేస్టే! వెన్నులో ఒణుకు పుట్టించే ఒక నావ కథ..

Mary Celeste : మేరి సెలేస్టే! వెన్నులో ఒణుకు పుట్టించే ఒక నావ కథ..

Telugu Flash News

Mary Celeste ship : 1872, డిసెంబర్ 5వ తేదీన కెప్టెన్ డేవిడ్ మోర్ హౌజ్ తన సిబ్బందితో న్యూయార్క్ నుంచి జెనోవకు వ్యాపార నావలో వెళ్తుండగా పోర్చుగల్ లోని అజోరెస్ కు 740 కిలోమీటర్ల దూరంలోని తీర ప్రాంతంలో తనకంటే యెనిమిది రోజుల ముందే గమ్యం చేరుకోవాల్సిన తన స్నేహితుడి నావ సముద్రంలో ఒక్క చోటే తేలుతూ కనిపించింది.

ఆ నావలో ఎవరూ కనిపించకపోవడంతో కెప్టన్ డేవిడ్ వెంటనే తన సిబ్బందిని నావను పరిశీలించమని, అసలేమైందో తెలుసుకోమని పంపాడు. నావని పరిశీలించడానికి వెళ్లిన సిబ్బంది నావ నలువైపులా వెతకగా ఆ నావ అసలేమాత్రం చెక్కు చెదరకుండా కనిపించింది.

కానీ నావలో ఉండవలసిన లైఫ్ బోట్, మార్గదర్శకాలు తెలియ చేసే వస్తువులూ కనిపించక పోవడంతో పాటు వత్తిడిని కొలిచే రెండు పైపులలో ఒకటి విడతీసి కనపడగా, 1700 బ్యారెల్ల మద్యం మాత్రం భద్రంగా కనిపించాయి.

నావకి 3 అడుగుల లోతు నీళ్లు పైకి వచ్చినప్పటికీ, అంత తక్కువ శాతం నీళ్ళు నావకు హాని కలిగించే అవకాశం లేదు. అయితే నావలో ఉండాల్సిన కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్, తన భార్య సార, కుమార్తె సోఫియా మరియు ఏడుగురు సిబ్బంది కనిపించకుండా పోయారు.

నావ మొత్తంలో మనుషులు ఉన్న సూచనలే లేవు.అలా నావను పూర్తిగా ఇంచు ఇంచు వెతికిన సిబ్బంది కెప్టెన్ డేవిడ్ కి అక్కడ కనిపించింది అంతా వివరించి చెప్పారు.అంతా విన్న కెప్టెన్ డేవిడ్ ఏం చేయాలో అర్థం కాక ఆ నావ నుంచి వెను తిరిగి వెళ్లి వెళ్ళిపోయాడు.

1861వ సంవత్సరంలో కెనడాలోని నోవా స్కోషియాకి చెందిన స్పెన్సర్ ఐలాండ్లో అమెజాన్ అనే నావ తయారు చేయబడింది.

-Advertisement-

మే 18,1861న ఆ అమెజాన్ నావ ప్రయాణించడం మొదలు పెట్టినప్పటి నుండి వివిధ రకాల అడ్డంకులు ఎదురుకుంటూ వచ్చింది. మొదటి సారి సముద్రంలోకి ప్రయాణించినప్పుడు ఆ నావను నడుపుతున్న కెప్టెన్ న్యుమోనియాకి గురై అనారోగ్యంతో చనిపోయాడు.

mary celestie shipఅలా ఆ నావ ఎన్ని సార్లు సముద్రంలో ప్రయాణానికి వెళ్ళినా సరే ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఆలా ఒక సంవత్సరం తరువాత ఆ నావను అమెరికాకు చెందిన రిచర్డ్ W.హైన్స్ అనే వ్యక్తి కొనుగోలు చేసి మేరి సెలేస్టే గా పేరు మార్చారు.ఎంత మంది చేతులు మారినా సరే ఆ నావను కొన్న వారు,నడిపిన వారు ఏదో ఒక ప్రమాదానికి గురవతూనే వచ్చారు.

ఆ తరువాత 1872లో ఆ నావలో ప్రయాణించిన కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ కనిపించకుండా పోగా,అసలు ఆయనికీ ఆయన కుటుంబానికి, సిబ్బందికి ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు.కొంత మంది వారి ఆలోచనలకు తగ్గట్టు రక రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

వారిని గ్రహాంతరవాసులు అపహరించారని కొంతమంది, సముద్రంలోని ఏదో ఒక జీవి చంపిందని కొంతమంది, సముద్రపు దొంగలు చంపారని మరి కొంత మంది ఇలా చాలా సిద్ధాంతాలనే ప్రజల ముందుకు తీసుకువచ్చారు.

నావలో దెయ్యం ఉందని పుకారు కూడా పుట్టించారు.ఇంకొందరు నావలో వస్తున్న నీరుని చూసి భయపడి కెప్టెన్ బెంజమిన్ మిగిలిన వారు లైఫ్ బోట్ తీసుకుని వెళ్ళిపోయుంటారని ఎవరికి తోచిననట్టు వారు సొంత సిద్ధాంతంలో కథలను రక్తి కట్టించారు. ఏదేమైనా అసలు ఆ రోజు నావలో ఉన్న వారికి ఏం జరిగిందో ఎవరికీ అంతు చిక్కకుండాపోయింది.

వారిని చంపేశారా? వాల్లే ఏమైనా చేసుకున్నారా? అసలక్కడ ఏం జరిగింది? నావలో వాళ్ళు ఏమయ్యారు? ఇలా ప్రశ్నలెన్నో కానీ వాటికి సరైన సమాధానాలే లేవు.ఇప్పటికీ మేరి సెలేస్టే లోని కెప్టెన్ బెంజమిన్ కి మిగతా వారికీ ఏమైందన్న విషయం రహస్యంగానే మిగిలిపోయింది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News