HometelanganaCrime News : పదో తరగతి బాలికపై ముగ్గురు స్నేహితుల అత్యాచారం

Crime News : పదో తరగతి బాలికపై ముగ్గురు స్నేహితుల అత్యాచారం

Telugu Flash News

Crime News : యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించి వివిధ సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ సిటీ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సిటీలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఇంటర్ చదువుతున్న ఓ అబ్బాయిని ఆమె ప్రేమించేది. సంవత్సరం క్రితం ఒక సందర్భంలో బాలుడి ఫ్రెండ్స్ ఇద్దరు సన్నిహితంగా ఉండగా వీడియో, ఫొటోలను రహస్యంగా తీశారు. వాటిని చూపిస్తూ..తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ మద్య వాళ్ళ ఫ్రెండ్స్ మరో ముగ్గురు, ఆ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం మూడు రోజుల క్రితం షీటీమ్‌ దృష్టికి రావడంతో అత్యాచారానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. విషయాన్ని గోప్యంగా ఉంచారు.

బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ప్రేమికుడితో పాటు ఆరుగురిపై పోలీసులు పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. నమోదైన ఆరుగురిలో ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులు కాగా, మరో వ్యక్తి మేజర్‌, పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసిన వారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

also read :

Kamal Haasan : షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్

-Advertisement-

Actress Rakul Preet Singh Latest photos 27-06-2023 💙

horoscope today in telugu : 27-06-2023 ఈ రోజు రాశి ఫలాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News