Hometelanganamancherial : వివాహేతర సంబంధం.. ఆరుగురి సజీవ దహనం.. పోలీసులు ఏం చెప్పారు ? అసలు స్టోరీ ఏంటి ?

mancherial : వివాహేతర సంబంధం.. ఆరుగురి సజీవ దహనం.. పోలీసులు ఏం చెప్పారు ? అసలు స్టోరీ ఏంటి ?

Telugu Flash News

మంచిర్యాల (mancherial) జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో గత రాత్రి ఆరుగురిని సజీవ దహనం కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న ఆరుగురు మృతి చెందారు.

పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాస పద్మ (45), శివయ్య (50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాలుగు నెలల క్రితం ఓ కూతురు ఆత్మహత్య చేసుకుంది.

కొడుకు నస్పూర్‌లో, రెండో కూతురు హైదరాబాద్‌లో ఉంటున్నారు. పద్మ దంపతులు తమ కుమార్తె అంత్యక్రియల నిమిత్తం మూడు నెలల క్రితం వచ్చి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. సింగరేణిలో కూలీగా పనిచేస్తున్న శనిగారపు శాంతయ్య అలియాస్ సత్తయ్య(57) పద్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతను కూడా అదే ఇంట్లో నివసిస్తున్నాడు.

కొండంపేటకు చెందిన నెమలికొండ మౌనిక (23) తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి (2), హిమబిందు (4)లతో కలిసి రెండు రోజుల క్రితం పెద్దమ్మ పద్మ ఇంటికి వచ్చింది. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ కేసు విచారణలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మంచిర్యాల జిల్లా ఊట్కూర్‌కు చెందిన శాంతయ్యకు పదేళ్ల క్రితం పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలంగా పద్మతో కలిసి ఉంటున్నాడు. విషయం తెలిసిన శాంతయ్య భార్య సృజన అడగటంతో వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది.

శాంతయ్యపై హత్యాయత్నం

శాంతయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకులిద్దరూ నిరుద్యోగులు. ఈ క్రమంలో శాంతయ్య అన్ ఫిట్ గా సర్టిఫికెట్ ఇస్తే వారసులకు ఉద్యోగం వస్తుంది. గత కొంత కాలంగా అన్ ఫిట్ అవ్వాలని భార్య, పిల్లలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-

ఈ క్రమంలో వారి మధ్య శత్రుత్వం మరింత పెరిగింది. మరోవైపు శాంతయ్య తన జీతం మొత్తాన్ని పద్మకు, రూ. 25 లక్షలు కూడా ఆమెకు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో శాంతయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శాంతయ్యపై ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగినా ప్రాణాలతో బయటపడ్డాడు.

ఓ సారి కిడ్నాప్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో లాభం లేదని తేల్చిచెప్పిన సృజన.. ప్రియుడి సాయంతో వారిని హత్య చేయాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంతలో పెద్దమ్మను చూసేందుకు వచ్చిన చిన్నారులతో సహా మౌనిక మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

ముందే చంపేసి నిప్పు పెట్టారా ?

ఘటన జరిగిన ఇంటి వెనుక సగం కాలిపోయిన టైర్లను పోలీసులు గుర్తించారు. వాటికి కొద్ది దూరంలో 20 లీటర్ల పెట్రోల్ క్యాన్లు పడి ఉన్నాయి. ఇంటి గుమ్మంలో నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

అయితే చుట్టుపక్కల మంటలు చుట్టుముట్టినప్పటికీ లోపల నుంచి అరుపులు వినిపించలేదని స్థానికులు చెప్పడంతో.. ముందుగా మత్తుమందు ఇచ్చి హత్య చేసి ఇంటికి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

also read news: 

Viral Video : కిశోర్ కుమార్‌, లతా మంగేష్కర్‌ పాటతో మైమరపించిన తండ్రీ కుమార్తె.. చూస్తే మీరూ హమ్‌ చేస్తారు!

Avatar 2 : రెండు రోజుల్లోనే ఇండియాలో ‘అవతార్ 2’ అన్ని కోట్లు వసూలు చేసిందా ?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News