Homecinemaమహేశ్ బాబు సినిమా తరువాతే ‘మహాభారతం’.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

మహేశ్ బాబు సినిమా తరువాతే ‘మహాభారతం’.. విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telugu Flash News

భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా సినిమా తీయాలని దర్శకధీరుడు రాజమౌళి ఆకాంక్షించారు. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ గా పాపులర్ అయిన ఈ సినిమాపై ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అంతేకాకుండా.. ‘RRR’ మరియు ‘SSMB 29’ సీక్వెల్‌పై అంచనాలను పెంచేలా మాట్లాడాడు. మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అడ్వెంచర్ మూవీ. దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం.

ఈ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని మించి ఉంటుంది. ఎన్టీఆర్-రాంచరణ్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హాలీవుడ్ సినిమాలా తీయాలనుకుంటున్నాం. రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా? లేక ఎవరైనా హాలీవుడ్ దర్శకుడిగా పనిచేస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేం. లేదంటే రాజమౌళి పర్యవేక్షణలో సినిమా రూపుదిద్దుకుంటుంది.

మహేశ్ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌తో రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అతని రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి తెలుసుకోవాలని సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ ప్రాజెక్ట్ చాలా భారీగా చేయాలి. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలి. ‘మహాభారతం’ నా లాంగ్ టైమ్ ప్రాజెక్ట్. అయితే, అందులో అడుగు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ‘మహాభారతం’ తీస్తే పది భాగాలు చేయాల్సి వస్తుందని భావిస్తున్నాను. అయితే, ఎన్ని భాగాలు ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేను. అని చెప్పారు.

also read :

-Advertisement-

Ashes Series 2023 : చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ధోని ప్రపంచ రికార్డు బద్దలు

Janhvi Kapoor Looks Gorgeous In Green Saree With Blue Blouse, See Sexy Stills

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News