Monday, May 13, 2024
HomenationalUttar Pradesh News : ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారం..!

Uttar Pradesh News : ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారం..!

Telugu Flash News

Uttar Pradesh News : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. పశువులకు మత్తుమందు కోసం ఇచ్చే ఇంజక్షన్లు ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఫజల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిద్వాయ్ నగర్ లో నివాసముంటున్న అర్జున్ సింగ్ అనే వ్యక్తి షోరూంలో పనిచేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. మళ్లీ కలుస్తానని ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

నాలుగు రోజులపాటు ఆమెను బందీగా ఉంచి పలుమార్లు క్రూరంగా ప్రవర్తించాడు. ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసిన నిందితుడు.. విషయం బయటపెడితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ కాల్ చేసి రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోని నిందితుడు ఈ నెల 6 న బాధితురాలికి వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఘటనాస్థలికి చేరుకున్న ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.

read more news :

Niharika Konidela : ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా! వెల్‌కమ్ వదినా.. నీహారిక పోస్ట్

Andhra Pradesh News : సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Bellamkonda Suresh : ప్రముఖ నిర్మాత కారులో చోరీ

-Advertisement-

Robbery : దొంగతనానికి వచ్చి.. ఛార్జింగ్ పెట్టి.. ఫోన్ మర్చిపోయిన దొంగ 📱

 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News