Monday, May 13, 2024
HomeinternationalTanzania Floods : టాంజానియాలో వరదలు, విరిగిపడిన కొండచరియలు: 47 మంది మృతి

Tanzania Floods : టాంజానియాలో వరదలు, విరిగిపడిన కొండచరియలు: 47 మంది మృతి

Telugu Flash News

Tanzania Floods : తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో వర్షాల కారణంగా అతలాకుతలంమైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు సంభవించాయి. ఈ ఘటనలలో 47 మంది మృతి చెందారు. మరో 85 మంది గాయపడ్డారు.

శనివారం ఉత్తర టాంజానియాలోని కటేష్‌ పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా సంభవించిన వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు.

టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ ప్రస్తుతం దుబాయ్‌ పర్యటనలో ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆమె, ప్రజలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టాంజానియాలో వర్షాలు, కొండచరియలు సంభవించడానికి వాతావరణ మార్పులే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News