Telugu Flash News

Sai Dharam Tej: నేను తాగి మాట్లాడ‌లేదు.. ప్ర‌మాదం వ‌ల‌న అలా అయింద‌ని చెప్పిన సాయిధ‌ర‌మ్ తేజ్

sai dharam tej struggles during accident

Sai Dharam Tej: 2021 సెప్టెంబర్ నెలలో హీరో సాయి ధరమ్ తేజ్ ఘోర ప్రమాదానికి గురైన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో కోమాలోకి కూడా వెళ్లి నెల‌ల త‌ర‌బ‌డి బెడ్‌కే ప‌రిమితం అయ్యారు. అయితే కోలుకున్న త‌ర్వాత చాలా కాలం పాటు సాయిధ‌ర‌మ్‌కి క‌ళ్లు క‌నిపించ‌లేదు. ప్రమాదం కారణంగా త‌న మాట పడిపోయింది.

ఓ సంద‌ర్భంలో మాట్లాడుతుంటే మాట త‌డ‌బ‌డింది. అప్పుడు 90 ఎల్ వేసి వ‌చ్చావా అంటూ కొంద‌రు అవ‌హేళ‌న చేశారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే నా నోటి నుండి మాటలు రావడం కష్టమైంది అని త‌న బాధ‌ను చెప్పుకున్నాడు తేజ్.మాటలు రావ‌డం క‌ష్టమైన సమయంలో నాకు మాట విలువ తెలిసొచ్చింది. రిపబ్లిక్ మూవీలో నాలుగు పేజీల డైలాగ్ చెప్పిన నేను రెండు మాటలు మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను.

ఆ సమయంలో సన్నిహితులు మద్దతుగా నిల‌వ‌డంతో ఎలాగోలా మాట సమస్యను అధిగమించాను… అని సాయి ధరమ్ తేజ్ త‌న బాధ‌లు చెప్పుకొచ్చారు. ఇప్ప‌డు ఆయ‌న న‌టించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

also read :

Special Story : ఆ ఊరంతా ఉద్యోగులే.. సత్తా చాటుతున్న బంజారా గ్రామం

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

Exit mobile version