Tuesday, May 14, 2024
HomenationalRoad Accident : దూసుకొచ్చిన కంటైనర్..10 మంది దుర్మరణం

Road Accident : దూసుకొచ్చిన కంటైనర్..10 మంది దుర్మరణం

Telugu Flash News

Road Accident : మహారాష్ట్రలోని ధులేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వరుస వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది చనిపోయారు.

20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధూలేలోని పలాస్నార్ గ్రామం సమీపంలో హైవేపై వెళ్తున్న కంటైనర్ నాలుగు వాహనాలను ఢీకొట్టి హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 నుండి 30 మందికి పైగా గాయపడ్డారు.

వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.

ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రక్కు డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు. కంటెయినర్ రెండు ద్విచక్రవాహనాలు, ఒక కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్‌ను ట్రక్కు ఢీకొని బోల్తా పడింది.

-Advertisement-

మధ్యప్రదేశ్ నుండి ధులే వైపు కంటైనర్ ట్రక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బాధితుల్లో స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్నవారు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శిర్పూర్, ధులేలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

read more :

Cheque Bounce Case : పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కాంగ్రెస్ నేతలు

Prabhas : రాముడు గా ఓకే.. విష్ణువు గా కూడానా ? ‘ప్రాజెక్ట్ కే’ మూవీ అప్డేట్ లో నిజమెంత?

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News