HomecinemaRashmi Gautam: ఆపు నీ వేషాలు అంటూ ర‌ష్మీపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అంత త‌ప్పు ఏం చేసింది..!

Rashmi Gautam: ఆపు నీ వేషాలు అంటూ ర‌ష్మీపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. అంత త‌ప్పు ఏం చేసింది..!

Telugu Flash News

Rashmi Gautam:  న‌టిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఆ తర్వాత యాంక‌ర్‌గా స‌త్తా చాటిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌత‌మ్. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ర‌ష్మీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంది. అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ మ‌రోవైపు ప‌లు షోస్‌ల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ అమ్మ‌డి పెళ్లి, ప్రేమ వంటి వ్యవహారాలు తరచుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. రెండు మూడు నెలలకోసారి రష్మీ వివాహం చేసుకుంటున్నారని, ఆమె ప్రియుడు ఈయనే అంటూ వార్తలు వస్తుంటాయి. మీడియా ఇంటరాక్షన్స్ లో రష్మీ ఈ వార్తలను ఖండిస్తూ ఉంటుంది. ఇది నిత్యకృత్యంగా మార‌గా, అదే సమయంలో ఆమె ఈ తరహా గాసిప్స్ ద్వారా జనాల నోళ్ళలో నానాలి అనుకుంటుందేమో కానీ… అస్పష్టంగా కొన్ని కామెంట్స్ చేస్తూ వ‌స్తుది.

ర‌ష్మీ యాంక‌ర్‌గా ఉన్న బుల్లితెర షోలకి దారుణమైన ప్రోమోలు కట్ చేస్తారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు టీఆర్పీ తేవడం కోసం రష్మీని బాగా వాడేస్తున్నారు. పలుమార్లు ఈ రెండు షోలలో రష్మీ తన పెళ్లి గురించి చెప్పబోతున్నట్లు, ప్రియుడి పేరు వెల్లడిస్తున్నట్లు ప్రోమోలు కట్ చేసి వ‌ద‌ల‌గా, జ‌నాలు చాలా ఆస‌క్తి చూపించారు. ఫార్ములా బాగానే వ‌ర్క‌వుట్ అయింది. అయితే ప్రోమోలో చాలా ఆస‌క్తి రేపిన మేక‌ర్స్ చివ‌ర‌కు ఎపిసోడ్‌కి వ‌చ్చే స‌రికి తుస్ అనిపించారు. అది ప్రోమో కోసం ఇచ్చిన హైప్ మాత్రమే అని తెలుసుకొని నిరాశ చెందారు ఆమె ఫ్యాన్స్ .

అయితే ప‌దిసార్లు మోసపోయినోడు పదకొండో సారి మోసపోడు కదా. అలాగే విసిగిపోయిన జనాలు మల్లెమాల సేమ్ ట్రిక్ ప్లే చేస్తుంటే తిట్టిపోస్తున్నారు. తాజాగా ప్ర‌సారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో కూడా ఆమె త‌న పెళ్లి గురించి చెబుతుందేమో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, చివ‌ర‌కు అది కూడా టీఆర్పీ కోస‌మే అని తేలింది. ప్రోమోలో ఎవ‌రిని చేసుకోబోతున్నావ్ అని పంచ్ ప్రసాద్ అడిగారు. అందులో ఆమె సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతుండగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో కట్ చేశారు. అది చూసిన జనాలు రష్మీని తిట్టిపోస్తున్నారు. ఆపు మీ వేషాలంటూ ఇప్పటికి చాలా చూశామని మండిపడుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News