Sunday, May 19, 2024
Homecinemaఆ ఇద్దరి అభిమానం మర్చిపోలేను : నటి ప్రాచీ దేశాయ్‌

ఆ ఇద్దరి అభిమానం మర్చిపోలేను : నటి ప్రాచీ దేశాయ్‌

Telugu Flash News

మనోజ్‌ బాజ్‌పేయి, అక్కినేని వారసుడు నాగచైతన్య ఇద్దరూ తనను ఎంతో ఆదరించారని చెబుతున్నది నటి ప్రాచీ దేశాయ్‌. మనోజ్‌తో ‘సైలెన్స్‌ 2’లో పనిచేశాను. ఇటీవల విడుదలైన ‘దూత’లో నాగచైతన్యతో స్క్రీన్‌ పంచుకున్నాను. ఈ రెండు సిరీస్‌ల షూటింగులు వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాల్లో జరిగినా.. తన పట్ల వీరిద్దరూ చూపించిన అభిమానం మర్చిపోలేనని చెబుతున్నది ప్రాచి.

పసందైన భోజనంతో మెప్పించారు

పసందైన భోజనంతో ఈ ఇద్దరూ తనను కట్టిపడేశారని కాంప్లిమెంట్స్‌ ఇచ్చింది. నాగచైతన్యతో ‘దూత’ షూటింగ్‌ సరదాగా, ఆహ్లాదంగా జరిగిందని ప్రాచి తెలిపింది. సీన్ల గురించి ఆలోచించకుండా, లంచ్‌ బ్రేక్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేదని చెప్పింది. చైతన్య ప్రతిరోజూ ఏదో ఒక రుచికరమైన వంటకాన్ని తీసుకొచ్చేవాడు. ఆ వంటకాలను టేస్ట్‌ చేయడానికి ఎప్పుడూ ఉత్సుకతగా ఉండేదని పేర్కొంది.

మనోజ్‌ గురించి

“మనోజ్‌ సార్‌ కో-స్టార్‌ గురించి చాలా కేర్‌ తీసుకుంటారు. అవసరమైన సలహాలు చెబుతారు. పూర్తి స్వేచ్ఛనిస్తారు. అంతేకాదు లంచ్‌ టైమ్‌కి రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేసేవారు. తను స్వయంగా చేసి మరీ తెచ్చేవారు” అని మనోజ్‌ను ఆకాశానికెత్తేసింది ప్రాచి.

ప్రాచీ మాటలలో

-Advertisement-

“మనోజ్‌ సార్‌, చైతన్య ఇద్దరూ చాలా మంచి వ్యక్తులు. నాకు చాలా సహాయం చేశారు. షూటింగ్‌ సమయంలో చాలా వినోదం కలిగించారు. నాకు చాలా ముచ్చటగా ఉంది” అని ప్రాచీ చెప్పింది.

also read :

సమంత సినిమాపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News