HomecinemaPawan Kalyan: ఇది క‌దా ప‌వన్ మేనియా.. రీరిలీజ్‌ని కూడా ఇంత‌గా ఆద‌రిస్తారా...!

Pawan Kalyan: ఇది క‌దా ప‌వన్ మేనియా.. రీరిలీజ్‌ని కూడా ఇంత‌గా ఆద‌రిస్తారా…!

Telugu Flash News

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కూడా ఆన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. చేసింది త‌క్కువ సినిమాలు, హిట్స్ కూడా అంత పెద్ద‌గా సాధించ‌లేదు. కాని ఆయ‌నకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. పవన్ కెరీర్‌లో పదేళ్లు చాలా దారుణంగా గ‌డిచింది. ఖుషీ తర్వాత ఆయ‌న చేసిన ఒక్క సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కాలేదు. వరసగా ఆరు విజయాలు అందుకున్న పవన్.. ఒక్క హిట్ కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసారు. అయినా కూడా ఈయన ఇమేజ్ మాత్రం అలాగే ఉంది.

తాజాగా ఖుషీ సినిమా రిరిలీజ్‌తో తన రికార్డును తానే బద్దలు కొట్టారు పవన్. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లు ద‌ద్ద‌రిల్లాయి. అయితే ఈ సినిమాకి బెనిఫిట్ షో కూడా వేయ‌డం విశేషం. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా రీరిలీజ్ కు బెనిఫిట్ షోలు ప్లాన్ చేయటం తొలిసారి అని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది.

రీరిలీజ్ లు అవుతున్న చిత్రాల్లో ఎక్కువ గ్రాస్ చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రం 3.50 గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. పవర్​స్టార్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1న ‘జల్సా’ను రీ రిలీజ్ చేయగా.. వరల్డ్ వైడ్ రూ.3.2 కోట్లు వసూలు చేసింది. తాజాగా డిసెంబరు 31న రీరిలీజైన.. ‘ఖుషి’ రూ.3.5 కోట్లకు పైగా కలెక్ట్​ చేసి.. ‘జల్సా’ రికార్డును బ్రేక్ చేసింది. అంతకుముందు రీ రిలీజ్​ అయిన సూపర్​స్టార్ మహేశ్​ బాబు ‘పోకిరి’ మూవీ రూ.1.75 కోట్ల వసూళ్లతో థర్డ్ ప్లేసులో ఉంది. మొత్తానికి ప‌వన్ క‌ళ్యాణ్ త‌న రికార్డుని తానే చెరిపేసుకున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News