Sunday, May 12, 2024
Homecinemaనయనతార ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా సినిమా !!

నయనతార ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా సినిమా !!

Telugu Flash News

టాలీవుడ్‌లో భారీ సినిమాలను నిర్మించే బ్యానర్లలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). ప్రస్తుతం ఈ బ్యానర్ పై ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత మిగతా ప్రాజెక్టులపై ఆలోచన చేయాలని మైత్రీవారు అనుకుంటున్నారు.

‘పుష్ప 2’ సినిమా విడుదల తరువాత, తమిళంలో నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో ఒక సినిమాను నిర్మించి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మైత్రీవారు భావిస్తున్నారు. ఈ కథను నయనతారకు చెప్పగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఇంతవరకూ నయనతార అందుకోని పారితోషికాన్ని మైత్రీవారు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏ జోనర్‌కు సంబంధించినది? దర్శకుడు ఎవరు? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, ‘పుష్ప 2’ సినిమా విడుదల కావలసిందేనట.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News