Thursday, May 9, 2024
Homeandhra pradeshMinister Roja: మంత్రి రోజాకు అస్వస్థత 😥 అపోలో ఆస్పత్రికి తరలింపు

Minister Roja: మంత్రి రోజాకు అస్వస్థత 😥 అపోలో ఆస్పత్రికి తరలింపు

Telugu Flash News

ఏపీ పర్యాటక శాఖ మంత్రి, వైసీపీ నేత రోజా (Minister Roja) అస్వస్థతకు గురై ప్రస్తుతం చెన్నై థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కాలు నొప్పి మరియు వాపుతో భాధపడుతున్నారు, శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి ముందు చెన్నైలోని తన నివాసంలో మంత్రి కుటుంబ సభ్యులతో గడిపారు. అకస్మాత్తుగా కాలు నొప్పి మరియు వాపు రావడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.

అదృష్టవశాత్తూ ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రోజా అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆమె అభిమానులను, వైసీపీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది. అయితే, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.

read more news :

MLA Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు 😥

Andhra Pradesh News : సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News