HomecinemaMahesh: ఆ స‌మ‌యంలో ఎందుకు బ‌తికున్నారా అనిపించింది.. మ‌హేష్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

Mahesh: ఆ స‌మ‌యంలో ఎందుకు బ‌తికున్నారా అనిపించింది.. మ‌హేష్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

Telugu Flash News

Mahesh: జ‌బ‌ర్ధ‌స్త్‌తో పాపులారిటీ అందుకొని వెండితెర‌పై త‌మ స‌త్తా చాటుకున్న వారిలో మహేశ్‌ అచంట ఒకరు. తనదైన యాస, డైలాగ్స్‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో న‌వ్విస్తుంటాయి. చాలా సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు ద‌క్కించుకున్న మ‌హేష్‌..రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ప‌క్కనే ఉంటూ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత అత‌ను రంగస్థలం మహేశ్‌గా మారిపోయాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల గురించి చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు మ‌హేష్‌.

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏమి లేదు. చిన్న‌త‌నం నుండి సినిమాల‌పై ఉన్న ఇష్టంతోనే న‌టించాల‌ని హైద‌రాబాద్ వ‌చ్చా. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత నా ద‌గ్గ‌ర లేదు. చాలా బాధేసింది. అస‌లు ఎందుకు బతికున్నానురా అనిపించింది. చాలామంది బంధువులు, స్నేహితులు నీకు సినిమాలు అవసరమా? అని ఎన్నో అన్నారు. అప్పుడు ఎంత‌గానో బాధ‌ప‌డ్డాను. అయితే ఇప్పుడు మంచిగానే సెటిల్ అయ్యాను. హైదరాబాద్‌లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని కట్టుకున్నా అని మ‌హేష్ స్ప‌ష్టం చేశారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News