Monday, May 13, 2024
Homenationaldigital payments rankings : 2022 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం📲👏

digital payments rankings : 2022 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం📲👏

Telugu Flash News

digital payments rankings : 2022లో అత్యధిక డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు జరిగిన దేశాల జాబితాలో ఇండియా అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ MyGov.in శనివారం విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.

2022లో భారత్ 8,950 కోట్ల డిజిటల్ లావాదేవీలను నమోదు చేశారు. ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో మన దేశం వాటా 46 శాతం. ఇది భారతదేశం తర్వాత మొత్తం నాలుగు దేశాల మొత్తం లావాదేవీల కంటే ఎక్కువ. డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్యతో పాటు వాటి విలువ పరంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.

డిజిటల్ టెక్నాలజీకి ప్రజల మద్దతుతో పాటు భారత చెల్లింపుల వ్యవస్థ సమగ్రతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది.

సరికొత్త ఆవిష్కరణలు మరియు దేశవ్యాప్తంగా విస్తృత వినియోగంతో భారత్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని mygovindia website వెల్లడించింది. ఇండియా తర్వాత, డిజిటల్ పేమెంట్స్ లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. గత సంవత్సరంలో, ఆ దేశంలో మొత్తం 2,920 కోట్ల లావాదేవీలు జరిగాయి.

చైనా మూడో స్థానంలో ఉండటానికి రూ. 1,760 కోట్ల లావాదేవీలు జరిగాయి . థాయ్‌లాండ్ (1,650 కోట్ల లావాదేవీలు) మరియు దక్షిణ కొరియా (800 కోట్ల లావాదేవీలు)4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఈ సమాచారం mygovindia నుండి వెలువడింది. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. చౌక ధరలకు మొబైల్ డేటా సేవలు అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అన్నారు.

ప్రధాని మోదీ హయాంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు 100 రెట్లు పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 127 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 12,735 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. ఈ ఏప్రిల్‌లో 889 కోట్ల లావాదేవీలు రూ. 14.07 లక్షల కోట్లు నమోదయ్యాయి.

-Advertisement-

మే నెలలో 941 లావాదేవీల విలువ రూ. 14.30 లక్షల కోట్లు నమోదయ్యాయి. కోటి లావాదేవీలు నమోదయ్యాయి. UPI లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని mygovindia డేటాలో పేర్కొంది.

ఎన్‌పిసిఐ అభివృద్ధి చేసిన యుపిఐని ప్రవేశపెట్టినప్పటి నుండి దేశంలో డిజిటల్ చెల్లింపు సేవల వినియోగం విపరీతంగా పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రోజువారీ UPI లావాదేవీలు 100 కోట్లకు చేరుకోవచ్చని PwC నివేదిక అంచనా వేసింది. నివేదిక ప్రకారం, రాబోయే ఐదేళ్లలో రిటైల్ డిజిటల్ లావాదేవీలలో 90 శాతం UPI ఖాతాలోకి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల వాటా 8,371 కోట్లు కాగా, 2026-27 నాటికి అది 37,900 కోట్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ అంచనా వేసింది.

read more news :

TS IAS అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆరోపణ

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News