Tuesday, May 14, 2024
HomenationalG20 Summit : భారీ వర్షంతో జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు..!

G20 Summit : భారీ వర్షంతో జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు.. కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు..!

Telugu Flash News

G20 Summit : ఆదివారం దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షం జీ20 సదస్సుపై కూడా ప్రభావం చూపింది. సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలోకి నీరు చేరింది.

నీటిని తోడేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆయా దేశాల ప్రతినిధులు నీటిలో అటూ ఇటూ తిరుగుతున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో షేర్ చేసింది.

కేంద్రం రూ. జీ20 ఏర్పాట్లకు 2,700 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత్ మండపం నీటితో నిండిపోయింది . సిబ్బంది పంపులతో నీటిని తోడుతున్నారు. అభివృద్ధిలో అస్థిరత బయటపడింది..’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది.

ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘దేశంపై జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో వర్షాలు కూడా భాగమే’ అని ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు.

జీ20 సదస్సు జరుగుతుండగా.. భారత్ మండపంలోకి వరద నీరు చేరిన విషయాన్ని మీడియా ప్రస్తావించలేదు. దేశాన్ని ఎలా పాలించాలో మోదీజీ మీరు మా నుంచి నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మీ నుంచి నేర్చుకోవాలి’’ అని పార్టీ అధినేత పవన్ ఖేరా అన్నారు.

-Advertisement-

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News