Homenewscyber crime : కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు

cyber crime : కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు

Telugu Flash News

cyber crime : ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు తమ ఉచ్చులో ఏదో రకంగా ఎర వేసి డబ్బులు దండుకునేవారు. అది సాధ్యం కాకపోతే ఏకంగా అత్యున్నత స్థాయి అధికారి పేరును చెప్పి ట్రాప్ చేసేవారు. వాటన్నింటినీ అధిగమించి కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. అందుకు వ్యక్తుల వివరాలు తెలుసుకుని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఒక కుటుంబం రూ. 4 లక్షలు నష్టపోయారు.

వివరాల్లోకి వెళితే… ఉత్తర ఢిల్లీలోని ఓ కుటుంబం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 4 లక్షలు నష్టపోయారు. 29 ఏళ్ల గుర్సిమ్రాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తల్లికి ఇంటర్నేషనల్ కాల్ వచ్చిందని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. వారి బంధువు నౌనిహాల్ ఆస్ట్రేలియాలో చదువుతుండగా సైబర్ నేరగాళ్లు అతని పేరు చెప్పి కుటుంబాన్ని దోచుకున్నారు.

ఒకరోజు తన తల్లికి నౌనిహాల్ సింగ్ అని పరిచయం చేస్తూ కాల్ వచ్చింది. అతను తమ బంధువు కాదా అని అతని తల్లి ఫోన్‌లో మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత, తన స్నేహితులందరూ జైలులో ఉన్నారని, వారందరికీ ఒక వ్యక్తితో గొడవ జరిగిందని నైనిహాల్ చెప్పాడు. కేవలం నైనిహాల్ మాత్రమే బయట ఉన్నారని చెప్పారు. కేసు గురించి మరింత విచారించేందుకు లాయర్ తనకు ఫోన్ చేస్తారని తన తల్లికి చెప్పినట్లు పోలీసులకు వెల్లడించాడు.

వెంటనే , ఒక న్యాయవాది ఫోన్ చేసి, నౌనిహాల్‌ను జైలుకు పంపారని, అతను బెయిల్ పొందడానికి పోలీసులకు డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పాడు. చెల్లించకుంటే సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు కటకటాలపాలవాల్సి వస్తుందన్నారు. ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసేందుకు రాంచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు సంబంధించి విక్రమ్ కుమార్ ముండా పేరిట ఖాతా నంబర్ ఇచ్చాడు. మొదట రెండు లక్షలు అన్నాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు రూ. 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆర్టీజీఎస్‌ ద్వారా విడతల వారీగా డబ్బును అతడు ఇచ్చిన ఖాతా నంబర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులను విచారించగా.. నౌనిహాల్ క్షేమంగా ఉన్నాడని, అతడితో పాటు అతడి స్నేహితులపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసి కుటుంబీకులు షాక్ కు గురయ్యారు.

తాము సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్సిమ్రాన్ సింగ్ తెలిపారు. ఉత్తర ఢిల్లీకి చెందిన మరో కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసేందుకు నేరగాళ్లు ప్రయత్నించి విఫలమయ్యారని అధికారులు తెలిపారు. ఆ సందర్భంలో కూడా..కుటుంబానికి కెనడాలో బంధువులు ఉన్నారు.

-Advertisement-

అందుకే సైబర్ నేరగాళ్లు మీ బంధువులను జైలులో ఉన్నారని, బెయిల్‌పై విడుదల చేయడానికి డబ్బు అవసరమని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి విచారణ చేయగా అది ఫేక్ ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు తెలిపారు.

read more news :

sharwanand : శర్వానంద్ పెళ్లి సంబరాలు షురూ.. ఇదిగో వీడియో

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News