HomecinemaChiranjeevi: అల్లు రామ‌లింగ‌య్య కుట్ర‌.. గొర్రెపిల్ల‌ని లాక్కెళ్లిన‌ట్టు లాక్కెల్లార‌న్న చిరంజీవి

Chiranjeevi: అల్లు రామ‌లింగ‌య్య కుట్ర‌.. గొర్రెపిల్ల‌ని లాక్కెళ్లిన‌ట్టు లాక్కెల్లార‌న్న చిరంజీవి

Telugu Flash News

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి న‌ట‌న‌లోనే కాదు హాస్యంలోను చ‌తుర‌త చూపిస్తారు. ప‌బ్లిక్ ఈవెంట్స్ లో చిరు చేసే జోక్స్ తో తెగ న‌వ్విపోతుంటారు. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలో పాల్గొన్న ఆయన అల్లు రామ‌లింగయ్య గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. నటుడిగా ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం, ఎక్కువ సినిమాలు చేసే అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు చిరు. ఓ సారి మద్రాస్‌ కి వస్తుంటే ట్రైన్‌లో ఒకే కంపార్ట్ మెంట్లో కూర్చున్నాం. అందులో రావుగోపాల్‌రావు, ఆయన, మరికొంత మంది మందు బాటిల్‌ ఓపెన్‌ చేసుకుని తాగుతున్నారు. నన్ను ఓ పెగ్‌ వేయమని అడగ‌డంతో మొద‌టి పాయింట్ వ‌చ్చింది.

ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు

మరో చోట గీత అనేఅమ్మాయి ఉంటే అందరు ఆమెతో మాట్లాడుతుండ‌గా, నేను హార్స్ రైడింగ్‌ చేస్తుండ‌డంతో మ‌రో పాయింట్ ద‌క్కింది. ఎప్పుడైతే సురేఖని చూశానో.. అప్పుడు నో చెప్పలేకపోయానని చెప్పాడు చిరంజీవి. ఇక సురేఖ టీ తాగాక అస్స‌లు ఊఊ అన‌లేక‌పోయాను. నేను కళ్లు తెరిచే సరికి పెళ్లి అయిపోయింది. పెళ్లికి పెద్ద త‌తంగ‌మే న‌డిచింది. రామలింగయ్యకి ఇద్దరు కొడుకులున్నారు. ఒకరిని నిర్మాతని చేయాలని, మరొకరిని నటుడిని చేయాలని అనుకోగా, ఓ కొడుకు చ‌నిపోవ‌డంతో ఆయ‌న స్థానంలో న‌న్ను ఊహించుకున్నార‌ని చిరంజీవి అన్నారు.

కాగా అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్య‌క్ర‌మంలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, ఈ విషయాలను వెల్లడించ‌డం విశేషం. ఆయన ప్రసంగం ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉండంతో ప్ర‌తి ఒక్క‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఈ కార్యక్ర‌మంలో అల్లు అర్జున్‌, అల్లు స్నేహారెడ్డి, అల్లు రామలింగయ్య, అల్లు శిరీష్‌, బాబీ, రావురమేష్‌, బ్రహ్మానందం, , తనికెళ్ల భరణి , త్రివిక్రమ్, అలీ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News