HomecinemaAnasuya: ఇన్నాళ్ల‌కు అన‌సూయ ప‌శ్చాతాపం.. ఆ పని ఎందుకు చేసానంటూ భాద‌లో యాంక‌ర‌మ్మ‌

Anasuya: ఇన్నాళ్ల‌కు అన‌సూయ ప‌శ్చాతాపం.. ఆ పని ఎందుకు చేసానంటూ భాద‌లో యాంక‌ర‌మ్మ‌

Telugu Flash News

Anasuya: కొద్ది రోజుల ముందు వ‌ర‌కు అన‌సూయ త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొడుతూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉండేది. కాని ఈ మ‌ధ్య కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌గా మారుతుంది. రీసెంట్‌గా అన‌సూయ‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కి మ‌ధ్య పెద్ద వారే న‌డిచింది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన‌ ‘ఖుషి’ పోస్టర్‌లో ‘ది దేవరకొండ’ అని వేసుకున్నందుకు అన‌సూయ అత‌నిని టార్గెట్ చేసి ప‌లు కామెంట్స్ చేసింది. దీంతో అభిమానులు ఆయ‌న పేరు వేసుకుంటే నీకెందుకు? ‘ద దేవరకొండ’ అని వేసుకుంటే నీకెందుకు? ఇంక ఏమన్నా వేసుకుంటే నీకెందుకు ? అది అతని సినిమా కాబ‌ట్టి అతని ఇష్టం.. మధ్యలో అతన్ని జోలికి ఎందుకు వెళుతున్నావు అని తిడుతూ ఆంటీ పేరుతో త‌గె ట్రోల్ చేసారు. అయితే అనసూయ మాత్రం తక్కువ తిన్న‌దా.. వాళ్లు ఒకటి అంటే రెండు అంటా అన్నట్టుగా విజయ్ ఫ్యాన్స్‌కి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చి హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఇక అన‌సూయ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన కూడా త‌న గ్లామ‌ర్‌తో అభిమానుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. అయితే అన‌సూయ ఓ విషయంలో చాలా బాధ‌ప‌డుతుంద‌ట‌. అయ్యో.. అది చేసి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం చెందుతుంద‌ట‌. అనసూయ అంతగా ఫీల్ అవడానికి కారణం ఏమిట‌నేది చూస్తే.. అనసూయ డైట్ చీటింగ్ కి పాల్పడింద‌ట‌. ఇటీవ‌ల త‌న పెద్దకుమారుడు బ‌ర్త్ డే కావ‌డంతో టూర్ వెళ్లారు. అక్క‌డ ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వెకేషన్ అంటే బయట ఫుడ్ తప్ప‌క‌ తినాల్సిందే. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగినవి ఆర్డ‌ర్ చేయ‌క త‌ప్ప‌దు. అక్కిడి రుచిక‌రమైన వంట‌లు టేస్ట్ చేయాల‌ని ఉంటుంది కాబ‌ట్టి అన‌సూయ అన్ని లాగించేసింద‌ట‌. దాంతో ఈ అమ్మ‌డికి కాస్త బరువు పెరిగిన భావన కలుగుతుందట.

తాజాగా అనసూయ త‌న సోష‌ల్ మీడియాలో జిమ్ లో కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేసి..ఆ డిషెస్ తినకుండా ఉండాల్సింది అంటూ పశ్చాతాపం చెందుతున్న‌ట్టుగా కామెంట్ పెట్టింది.. అతిగా తిన్నందుకు ఇప్పుడు కరిగించుకోవ‌ల్సి వ‌స్తుంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది. ఇక అన‌సూయ పోస్ట్ పెడితే కామెంట్స్ ఏ రేంజ్ లో వ‌స్తాయో మ‌న‌కు తెలిసిందే. ఆమె పోస్ట్‌పై నెటిజెన్స్ డిఫరెంట్ కామెంట్లు పెడుతున్నారు. ఇక బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు సినిమాల‌తో బిజీగా ఉంటుంది. ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఇక పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా క‌నిపించి అల‌రించ‌నుంది. ‘విమానం’ అనే సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్ర పోషిస్తుండ‌గా, ఇందులో సుమ‌తి అనే పాత్ర‌లో క‌నిపించి మెప్పించ‌నుంది. ఇది తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ కాగా, ఇందులో అన‌సూయ పాత్ర వేశ్య అని అంటున్నారు.

read more news :

salman khan : విక్కీ కౌశ‌ల్‌ని పక్కకు నెట్టేసిన సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్

Tirupati: తిరుపతిలో బ్రహ్మోత్సవ సంబరం.. చిన్నశేష వాహనంపై గోవిందుడు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News