HomenewsAnasuya: న‌న్ను గెలికారో నేనేంటో చూపించాల్సి వ‌స్తుంది.. అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్

Anasuya: న‌న్ను గెలికారో నేనేంటో చూపించాల్సి వ‌స్తుంది.. అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్

Telugu Flash News

Anasuya: అందాల‌తో అల‌రించే అన‌సూయ ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్ అవుతుంది. గ‌త కొద్ది రోజులుగా అన‌సూయ‌- విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ మ‌ధ్య గ‌ట్టి వార్ న‌డుస్తుండగా, ఆమెని చాలా మంది దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అయిన త‌గ్గ‌నంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తుంది. తాజాగా అన‌సూయ చేసిన పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇందులో నువ్వు చేసిన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను. దీని వలన నేను మరింత వ్యతిరేకత ఎదుర్కొంన్నాన కూడా త‌గ్గేది లేదు. నువ్వు చేసిన దాని నుండి నువ్వు ఏ మాత్రం త‌ప్పించుకోలేవు.

నాకు న్యాయం, ధర్మం మీద చాలా న‌మ్మ‌కం ఉంది.. ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని సింపతీ పొందడానికి నేనేమి మోసగత్తెను కాదు. నేను అలా చేయను. మీరు ఎంత క్రిందకు లాగినా, బురద జల్లినా నా పోరాటం మాత్రం ఆగ‌దు. ఈ వివాదంలో ఎవరు తప్పో ఎవరు ఒప్పో తెలుసుకునే రోజు త‌ప్ప‌క‌ వస్తుంది. నేను అటెన్షన్ కోరుకుంటున్నాను అయితే మీరు అనుకుంటున్నట్లు కాదు. నా వర్క్, టాలెంట్ నాకు అటెన్షన్ తెచ్చిపెడతాయి. దానికి నేను అర్హురాలిని. అటెన్షన్ కోరుకోవడం నా వృత్తిలో భాగం. అలా అని నాకు పని లేదు, అందుకే అటెన్షన్ కోరుకుంటుందని అనుకోకండి. నాలోని అమ్మను కూడా టార్గెట్ చేశారు. ఆమె తిరగబడితో ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయించడానికి నేనేమీ బలహీనురాలిని కాదు… అని అనసూయ సందేశం పోస్ట్ చేసింది. చూస్తుంటే ఇప్ప‌ట్లో అన‌సూయ త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News