Homecinema‘కాంతారా’ సినిమా చూసిన అనసూయ రిషబ్‌ శెట్టి గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో ఏం చెప్పిందంటే ?

‘కాంతారా’ సినిమా చూసిన అనసూయ రిషబ్‌ శెట్టి గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో ఏం చెప్పిందంటే ?

Telugu Flash News

కన్నడ సినిమా కాంతారా తో రిషబ్ శెట్టి అనే హీరో మన తెలుగు తెరకి సుపరిచితుడయ్యాడు. KGF సినిమా వచ్చినపుడు హీరో యష్ ఎలానో అలా కాంతారా తో అందరికీ రిషబ్ శెట్టి పేరు తెలిసిపోయింది . రిషబ్ తన నటన తో అందరిని ఆశ్చర్య పరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నటన తీరుకి అందరూ తన పై ప్రశంసలు కురిపించారు. ఈ ఒక్క సినిమా తో రిషబ్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాంతారా సినిమా క్రియేట్ చేసిన హైప్ మామూలుగా లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా కలెక్షన్లను రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రిషబ్ శెట్టి నటనను మెచ్చుకోని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

కాగా, రిషబ్ శెట్టిపై టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఈ సినిమా విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానమిచ్చింది.

kantara movie in amazon prime

ఒక మంచి సినిమాని రికమెండ్ చేయమని ఆమె అభిమాని ఒకరు అడిగినప్పుడు, ఆమె కాంతారా అని సమాధానం ఇచ్చింది. ఈ సినిమాపై, హీరో రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి అనూహ్యమైన రీతిలో నటించాడు. ఇప్పటికీ ఆ సినిమా ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నాను అని చెప్పింది. అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ చిత్రంలో నటిస్తోంది.

also read news:

-Advertisement-

Litton Das: హిందువ‌ని అవ‌మానించారు.. ఇప్పుడు ఆ జ‌ట్టు త‌ల‌రాత మార్చ‌బోయేది ఇత‌నే…!

viral video : గుడిలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News