Telugu Flash News

Weather Today (29-5-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Weather report

Weather Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కాస్త రిలీఫ్‌ కలిగించే వార్త చెప్పింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది.

తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్‌, జయశంకర్‌ భూపాల్ పల్లి, మహబూబాబాద్, సూర్యపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ఇష్యూ చేసింది.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా 43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో అటు వర్షాలు, ఇటు ఎండలు.. భిన్నమైన వాతావరణం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు వెల్లడించారు.

ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో సెగలు పుట్టించే ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టీకరిస్తోంది.

Read Also : today horoscope in telugu : 29-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version