Telugu Flash News

Weather Today (21-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

weather report

Weather Today: ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షం ప్రభావం ఉంటుందని తెలిపారు.

మరోవైపు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు హైదరాబాద్, చుట్టు ప్రక్కల జిల్లాలలోని మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులలంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్రలో కూడా పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయని తెలిపారు.

Read Also : today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

Exit mobile version