Telugu Flash News

Weather Today (20-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Weather Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. తెలంగాణలో నేడు, రేపు కూడా పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎండలతో జనం అల్లాడుతుంటే రాగల మూడు రోజుల్లో ఓ ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణలో మోస్తరువ ర్షాలు కురిసే చాన్స్‌ ఉందని అధికారులు తెలిపారు.

ఏపీలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వేడి తగ్గడం లేదు. ఫలితంగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వేడి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి విజయవాడలో వేడి పెరిగింది.

Read Also: today horoscope in telugu : 20-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version