HomecinemaUpasana: ఇన్నాళ్లు పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డంపై స్పందించిన ఉపాస‌న

Upasana: ఇన్నాళ్లు పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డంపై స్పందించిన ఉపాస‌న

Telugu Flash News

Upasana: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట ఒక‌టి. ప‌దేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా సోష‌ల్ మీడియాలో త‌న అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇన్నాళ్లు పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డంపై ఉపాస‌న స్పందించింది.

Viral Video : రిసెప్షన్‌లో తుపాకీతో వధూవరుల పోజులు.. తృటిలో తప్పిన ప్రమాదం

మా వివాహం జరిగినప్పుడే చరణ్, నేను పదేళ్ల వరకు పిల్లలు వద్దని ఓ నిర్ణయం తీసుకున్నాము. మేము తీసుకున్న నిర్ణయాన్ని అమ‌లు చేసుకుంటూ ముందుకు సాగాము.ఇద్దరం కూడా మా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎద‌గ‌డంతో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడ్డాము. మా పిల్లలకు ఏ లోటు లేకుండా ఇప్పుడు అడిగింది ఇవ్వగలము అని ఉపాస‌న స్ప‌ష్టం చేసింది.

IPL 2023: రికార్డుల వేటలో కింగ్‌ కోహ్లీ.. డివిలియర్స్, రోహిత్‌ను వెనక్కి నెట్టాడు

పిల్లల విషయంలో సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిడికి మేము అస్స‌లు తలొగ్గలేదు. సమాజంతో పని లేకుండా మేము కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులం అయ్యాము అంటూ ఉపాస‌న ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News