HomecinemaTrivikram: త్రివిక్ర‌మ్ సతీమణి కూడా సినిమాల్లోకి .. ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా..

Trivikram: త్రివిక్ర‌మ్ సతీమణి కూడా సినిమాల్లోకి .. ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా..

Telugu Flash News

Trivikram: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాడు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న త్రివిక్ర‌మ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మ‌హేష్ బాబుతో సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

త్వ‌ర‌లో అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే త్రివిక్ర‌మ్ రోజు రోజుకి త‌న క్రేజ్ పెంచుకుంటూనే ఇప్పుడు త‌న భార్య‌ని సినిమా రంగంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బుట్ట‌బొమ్మ నిర్మాత‌గా

మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన క‌ప్పెల సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తుండ‌గా, సితార నాగ‌వంశీ నిర్మించే ఈ సినిమాకు బుట్ట‌బొమ్మ అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజ‌ర్ కూడా వ‌దిలారు. ఓ అమాయ‌క ప‌ల్లెటూరు అమ్మాయి, ప‌ట్నం పిల్లాడి ల‌వ్‌లో ప‌డితే ఎలా ? ఉంటుంద‌న్న క‌థాంశంతో సినిమాని రూపొందిచారు.

ఈ సినిమాకి సితార నాగ‌వంశీతో పాటు త్రివిక్ర‌మ్ భార్య సాయి సౌజ‌న్య కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటారని తెలుస్తుంది. మొత్తానికి త్రివిక్ర‌మ్ ఇలా త‌న భార్య‌ను కూడా నిర్మాత‌గా రంగంలోకి దింప‌డంతో ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ మంచి క్లాసికల్ డ్యాన్సర్ అనే విష‌యం తెలిసిందే. . గతంలో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇటీవ‌ల ఆవిడ కాలికి గజ్జె కట్టి నృత్యం చేశారు. ఈ నృత్య ప్రదర్శనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా లాంటి మరికొంత మంది ప్రముఖులు కూడా హాజ‌రు కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రై సంద‌డి చేయ‌డం విశేషం.

సౌజ‌న్య‌.. స్వయానా లిరిసిస్ట్ ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోద‌రుడి కూతురు. ఈమె త్రివిక్రమ్ కు మించిన ట్యాలెంటెడ్ అట. 2002లో త్రివిక్రమ్, సౌజన్యల పెళ్లి జర‌గ‌గా, వీళ్లిద్దరికీ ఇద్దరు సంతానం.

-Advertisement-

also read: 

ప్రపంచ దేశాల COP27 సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ : వైరల్ గా మారిన వీడియో !

ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పై భారతదేశపు మొట్టమొదటి ట్విట్టర్ యూజర్ నైనా రెధు ఏమన్నారో తెలుసా?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News