HomecinemaTrivikram: త్రివిక్ర‌మ్ త‌న సెంటిమెంట్ వ‌దిలే లేడుగా.. మ‌ళ్లీ మ‌హేష్ సినిమా కోసం ముగ్గురు..!

Trivikram: త్రివిక్ర‌మ్ త‌న సెంటిమెంట్ వ‌దిలే లేడుగా.. మ‌ళ్లీ మ‌హేష్ సినిమా కోసం ముగ్గురు..!

Telugu Flash News

Trivikram: స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ సినిమాల‌కి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌హేష్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇక ఈ సినిమాలోని నటీ నటుల వివరాల విషయంలో కూడా ఎప్ప‌టిక‌ప‌ప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లు గా పూజా హెగ్డే , శ్రీలీల నటిస్తుండ‌గా మ‌రో హీరోయిన్‌ని కూడా ప‌ట్టుకొస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌హేష్ 28వ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్ పాత్రకు గాను భూమి పడ్నేకర్ ను సంప్రదించారని.. అందుకు ఆమె ఓకే చెప్పిందని తెలిసింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కీలక పాత్ర ను భూమి పడ్నేకర్ తో చేయించి హిందీ ప్రేక్షకుల్లో కూడా సినిమా పై ఆసక్తి పెంచాలని త్రివిక్ర‌మ్ ఇలా ప్లాన్ చేశాడ‌ట‌. కాగా, మహేష్ బాబు చివరిసారిగా బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఆడిపాడిన విష‌యం తెలిసిందే. అలానే త్రివిక్రమ్ తాను తెర‌కెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశాడు. ఈ మూవీ పెద్ద హిట్ అయింది.

also read :

heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News