Telugu Flash News

Rashmi Gautham: ఆ ఎడ్యుకేష‌న్ కూడా అవ‌స‌రం అంటూ ర‌ష్మీ స్ట‌న్నింగ్ కామెంట్

Rashmi Gautham: అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై అల‌రిస్తూనే సోష‌ల్ యాక్టివిటీస్‌తో అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటుంది. తాజాగా ఆమె ఓ దారుణ సంఘటన మీద పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయింది. రజస్వల అయిన 12 ఏళ్ల బాలిక అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి చంపేశారట. ఇది కేవలం సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వలనే అని రష్మీ గౌతమ్ భావించింది. ఈ క్ర‌మంలో త‌న సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. కనీసం ప్రాథమిక అవగాహన లేకపోవడం వలెనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది.

ర‌ష్మీ పోస్ట్‌పై ప‌లువురు ప‌లు ర‌కాల అభిప్రాయాలు తెలియ‌జేస్తున్నారు. ఇక ఈ అమ్ముడు ప్ర‌స్తుతం యాంకరింగ్ లో తెగ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు గుడ్ బై చెప్ప‌డంతో ర‌ష్మీనే మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా మారి ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంక‌రింగ్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. నటిగా రేసులో రష్మీ వెనుకబడ్డా కూడా యాంక‌ర్‌గా అద‌ర‌గొడుతుంది.

Exit mobile version