Telugu Flash News

Ram Charan : రోజాకి దిమ్మ‌తిరిగే వార్నింగ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

ram charan

ram charan

Ram Charan : మెగా ఫ్యామిలీ హీరోలు ఎల్ల‌ప్పుడు వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌మ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు. అయితే ఎప్పుడైతే ప‌వ‌న్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారో ప్ర‌త్య‌ర్థులు ప‌వ‌న్‌తో పాటు ఫ్యామిలీ స‌భ్యుల‌ని సైతం విమ‌ర్శిస్తున్నారు.

ఇటీవ‌ల చిరంజీవిపై కొంద‌రు విమ‌ర్శలు గుప్పించిన నేప‌థ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇచ్చారు రామ్‌చరణ్‌.

నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో, మేం క్వైట్‌గా ఉండమని చెప్పారు. హన్మకొండలో శనివారం సాయంత్రం జరిగిన `వాల్తేర్‌ వీరయ్య` విజయ విహారం సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

స‌భ‌లో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, నాన్నగారు క్వైట్‌గా ఉంటేనే ఇంత మంది వచ్చాం. అదే ఆయన గట్టిగా బిగించి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

చిరంజీవిగారు సైలెంట్‌గా ఉంటారేమో తాము ఉండబోమని తెలిపారు చరణ్. రామ్‌చరణ్‌ వార్నింగ్‌ ఎవరికి అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఆ మధ్య చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే కొందరు ఏపీ పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇలాంటి కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి రామ్‌చరణ్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తుంది.

also read:

ఈ జ్యూసులు తాగి బరువు తగ్గిపోండి.. వేగంగా మార్పు గమనిస్తారు!

Exit mobile version