HomecinemaRajamouli: ఆస్కార్ ఈవెంట్ ఎంట్రీ కోస‌మే రాజ‌మౌళి అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడా..!

Rajamouli: ఆస్కార్ ఈవెంట్ ఎంట్రీ కోస‌మే రాజ‌మౌళి అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడా..!

Telugu Flash News

Rajamouli: 95వ ఆస్కార్ వేడుక‌లు ఇటీవ‌ల అట్ట‌హాసంగా జర‌గ‌గా, ఈ సారి ఆస్కార్‌లో నాటు నాటు పాట అద‌ర‌గొట్టేసింది. ఈ పాట‌కి ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌డ‌మే కాదు అవార్డ్ కూడా ద‌క్కింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఆస్కార్ అవార్డును చేజిక్కించుకున్నారు. అయితే ఆస్కార్ వేడుక పూర్తైన త‌ర్వాత ఇందుకు సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి రాజ‌మౌళి భారీగానే ఖ‌ర్చుచేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.. సాధార‌ణంగా విన్న‌ర్స్‌కు మాత్ర‌మే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో టికెట్స్ కొనుగోలు చేయ‌కుండా పాల్గొన‌డానికి ఛాన్స్ ఉంటుంది.

ఇక వారితో పాటు ఒక ఫ్యామిలీ మెంబ‌ర్‌ను మాత్ర‌మే ఉచితంగా వేడుక‌ను వీక్షించేందుకు అనుమ‌తి ఉంటుంది. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు మిగిలిన వారంద‌రూ టికెట్స్ కొనుగోలు చేసి ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం రాజ‌మౌళి దాదాపు కోటి న‌ల‌భై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసిన‌ట్లు వినికిడి.

also read :

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

Shriya Saran Photo Gallery Collection

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News