Telugu Flash News

Prudhvi Raj: ఆసుప‌త్రి బెడ్‌పై పృథ్వీ.. అత‌ని ఆరోగ్యానికి ఏమైంది..!

prudvi raj in hospital

Prudhvi Raj: వెండితెర‌పై త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్. ఆయ‌న 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. సినిమాల‌ల‌లో మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీ రాజ‌కీయాల‌లోకి కూడా వెళ్లారు. ఆయ‌న ఇప్పుడు ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. పృథ్వీకి సెలైన్ కూడా పెట్ట‌గా, ఆయ‌న అలానే బెడ్‌పై ప‌డుకొని సెలైన్ పెట్టుకుని ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ చేశారు.

“డైరెక్టర్‌ గా తొలిసారి సినిమా తీయబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి. 26న ఇంకా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. ఇలా అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నాను. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ ఉండాలి” అంటూ పృథ్వీరాజ్ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఏ అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు, ఇది నిజమేనా లేదంటే ప్ర‌మోష‌న‌ల్ స్టంటా అని కొంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

 

Exit mobile version