HomecinemaNayanthara - Vignesh Shivan : నయనతార జంటపై కేసు

Nayanthara – Vignesh Shivan : నయనతార జంటపై కేసు

Telugu Flash News

Nayanthara – Vignesh Shivan : నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌పై ఆస్తుల విషయమై ఓ కేసు నమోదైంది. నయనతార, విఘ్నేష్ శివన్ ఆరేళ్ల క్రితం ప్రేమించుకుని, రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. నయనతార సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూ సినిమాలతో బిజీగా ఉంది. ఫ్యామిలీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. సరోగసీ ద్వారా ఈ జంట కవలలకు జన్మనివ్వడం వివాదంగా మారింది. కేసును పరిశీలించిన కోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నయనతార , విఘ్నేష్ జంటకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేష్ శివన్ వంశం తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, లాల్ కుడి గ్రామానికి చెందినది. అతని తండ్రి పేరు శివకొళుదు. వారు తొమ్మిది మంది అన్నదమ్ములు. విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా గతంలో పనిచేసారు. అతను ఇపుడు లేరు. అయితే ఆయన జీవించి ఉండగానే కోయంబత్తూరులో నివాసముంటున్న మాణిక్యం మరో సోదరుడు కుంచితపాదం గురువారం 6 వ తేదీన తిరుచ్చి డీఎస్పీ కార్యాలయంలో తమ ఉమ్మడి ఆస్తిని సోదరులకు తెలియకుండా దోచుకున్నారని ఫిర్యాదు చేశారు.

వారి సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి తనకు తెలియకుండా ఉమ్మడి ఆస్తులను ఇతరులకు అమ్మి మోసానికి పాల్పడ్డారని, అలాగే వారి సోదరుడి కుమారుడు విఘ్నేష్‌పై కూడా తమ ఆస్తులు కొన్న వారికే డబ్బులు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. శివన్, అతని తల్లి మీనా కుమారి, భార్య నయనతార.. పై చర్యలు తీసుకోవాలని మాణిక్యం ఫిర్యాదులో కోరారు.దీంతో తిరుచ్చి డీఎస్పీ కేసు దర్యాప్తునకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.ఇప్పుడు ఈ ఘటన సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. .సరోగసీ వివాదం నుంచి బయటకు వచ్చిన నయనతార మళ్లీ అలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.

also read :

Nayanthara: న‌య‌న‌తార కొత్త వ్యాపారం.. మ‌హేష్‌, అల్లు అర్జున్ బాట‌లోనే..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News