Homecinemaమహేష్ బాబు సరసన ప్రియాంక ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే ?

మహేష్ బాబు సరసన ప్రియాంక ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే ?

Telugu Flash News

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu), త్రివిక్రమ్ (director trivikram) కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్, మహేష్ సరసన సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర గురించి త్రివిక్రమ్ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రియాంక మహేష్ తో సందడి చేయనుంది. ఆగస్ట్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా ఫైట్‌తో షూట్ స్టార్ట్ చేస్తారు. పదకొండేళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ ల సినిమా విడుదలవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాపై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి :

Ileana D’Cruz: మరోసారి ప్రేమలో పడ్డ ఇలియానా.. ఫొటోలు వైరల్‌

#RC15: రామ్ చరణ్ జిమ్ లో కసరత్తులు..వీడియో వైరల్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News