HomecinemaPrabhas: సెట్స్‌లో జాయిన్ కాబోతున్న ప్ర‌భాస్.. నిర్మాత‌ల‌లో వెల్లివిరిసిన ఆనందం

Prabhas: సెట్స్‌లో జాయిన్ కాబోతున్న ప్ర‌భాస్.. నిర్మాత‌ల‌లో వెల్లివిరిసిన ఆనందం

Telugu Flash News

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా త‌ర్వాత స్పీడ్ పెంచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చేతిలో ప్ర‌స్తుతం అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇవి భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్నాయి. శ‌ర‌వేగంగా షూటింట్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాలు కృష్ణంరాజు మృతి వ‌ల‌న ఆగిపోయాయి.

రెండునెల‌ల వ‌ర‌కు ప్ర‌భాస్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌డ‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌ర‌గింది. క‌ట్ చేస్తే నేటి నుండి ప్ర‌భాస్ స‌లార్‌ షూట్‌లో జాయిన్‌ అవుతున్నాడన్న అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ రోజు నుండి ప్ర‌ధాన పాత్ర‌ల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ కూడా షూట్‌లో జాయిన్ కానున్నాడ‌ట‌.

ఇక షూటింగ్స్ షురూ..

కేజీఎఫ్‌,కేజీఎఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ హిట్స్‌ అందించిన ప్రశాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్రంలో కోలీవుడ్‌ భామ శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.ఇక ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంతో పాటు మరి కొన్ని చిత్రాల షూటింగ్ బ్యాలెన్స్ ఉండ‌గా, వాటిని కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అనుకుంట‌న్నాడ‌ట‌.

సాధార‌ణంగా మన హీరోల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుదుట పడిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మన హీరోల లెవెల్ పెరిగిపోయి రేంజ్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సినిమాల షూటింగ్‌కి ఎక్కువ బ్రేక్ ఇచ్చే అవ‌కాశం లేదు.

కృష్ణంరాజు మరణంతో ఇప్పుడు ప్రభాస్ కి బాధ్యతలు పెరిగాయి. కృష్ణంరాజు పెద్దకర్మను ఆయన సొంత ఊరు మొగల్తూరులో చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోపక్క ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే వంటి సినిమాలు చేస్తుండ‌గా, సలార్ సినిమా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా అక్కడ 12 సెట్లు నిర్మించగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అందుకే ప్ర‌భాస్ కూడా నేటి నుండి షూటింగ్ లో పాల్గోని వీలైనంత త్వ‌ర‌గా ఈ ప్రాజెక్ట్ ముగించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News