Homelifestyleరోజూ 8 గ్లాసుల నీరు తాగక్కర్లేదట!!

రోజూ 8 గ్లాసుల నీరు తాగక్కర్లేదట!!

Telugu Flash News

మనందరికీ ప్రతిరోజూ గణనీయమైన మొత్తంలో నీరు త్రాగాలని చెప్పబడింది. అందుకే రోజూ గ్లాసుల కొద్దీ నీళ్లను మనం తాగుతుంటాం. అయితే పరిశోధకుల తాజా అధ్యయనంలో ఒక కొత్త విషయం బయటపడింది.

రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం అంటే చాలా ఎక్కువేనని అందులో పేర్కొన్నారు. ఈమేరకు వివరాలతో కూడిన నివేదిక ‘పర్యావరణ మరియు జీవనశైలి కారకాలతో ముడిపడి ఉన్న మానవ నీటి టర్నోవర్‌లో వైవిధ్యం’ అనే శీర్షికతో సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడింది.

భూ వాతావరణంలో, మానవ జనాభాలో మార్పులు సంభవించినప్పుడు మానవ వినియోగానికి అనుగుణంగా నీటి అవసరాలను నిర్వహించడం ఎలా కష్టతరంగా మారుతుందో ఈ నివేదిక నొక్కి చెబుతుంది.

ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు చెందిన అన్ని వయసుల 5,600 మందికిపైగా వ్యక్తులపై ఈ అధ్యయనం జరిగింది. ఇందులో పాల్గొన్న వారికి 100 మిల్లీలీటర్ల నీటిని ఐదు శాతం ‘డబుల్ లేబుల్డ్ వాటర్’తో సమృద్ధిగా అందించారు.

ఫలితంగా శరీరంలో కొన్ని హైడ్రోజన్ అణువులు, డ్యూటెరియం అనే మూలకం యొక్క స్థిరమైన ఐసోటోప్‌తో భర్తీ చేయబడ్డాయి. శరీరంలోని నీటి నుంచి అదనపు డ్యూటెరియం తొలగించబడే వేగాన్ని బట్టి మన బాడీలోని నీటి స్థాయిల్లో చోటుచేసుకునే మార్పును అంచనా వేయొచ్చు.

 

-Advertisement-

20 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు గల పురుషులు మరియు 20 నుండి 55 సంవత్సరాలలోపు వయస్సు గల స్త్రీలు అత్యధికంగా నీటిని తాగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

అయితే నీటిని తాగే సామర్ధ్యం పురుషుల్లో 40 సంవత్సరాల తరువాత, మహిళల్లో 65 సంవత్సరాల తరువాత తగ్గిపోయిందని అధ్యయనంలో తేలింది.నవజాత శిశువులు కూడా ప్రధానంగా ద్రవ ఆహార పదార్థాలపై ఆధార పడతారు. వాళ్ళ శరీరంలో రోజూ కొత్తగా 28 శాతం నీరు చేరుతుంటుంది.

దీన్నిబట్టి రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలనే సాధారణ సూచనను ఫాలో కావాల్సిన అవసరం అంతగా లేదు. అది ఎంతో ప్రయాసతో కూడిన పని అని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో వైట్ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళు.. పేద దేశాల కార్మికుల కంటే తక్కువ నీటిని తాగుతున్నారని అధ్యయనంలో గుర్తించారు.

also read news:

వెల్లుల్లి దంచి పాలలో ఉడికించి తాగితే

జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News