HomeinternationalUPI for NRIs : విదేశాల నుండి కూడా యుపీఐ పేమెంట్లు..

UPI for NRIs : విదేశాల నుండి కూడా యుపీఐ పేమెంట్లు..

Telugu Flash News

UPI for NRIs : యూపీఐ పేమెంట్స్.. ఇవి మనుగడలోకి వచ్చిన తరువాత మానవ జీవన విధానమే మారిపోయింది. ఎవరు ఏ ఊరులో ఉన్నా,ఏ రాష్ట్రంలో ఉన్నా ఫోన్ స్క్రీన్ మీద ఒక్క టచ్ తో డబ్బును ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రూపాయికి దొరికే చాక్లెట్ నుంచి వేలా రూపాయల ఫోన్ వరకు దేనికి డబ్బులు కట్టలన్నా ఒక్క టచ్ చాలు.ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఆన్లైన్ పేమేంట్స్ ఒక చరిత్ర.ఇది భారత్ కి మాత్రమే చెందిన విజయం.ఇప్పుడు ఈ సేవలను భారత్ బయట ఉన్న భారతీయులు కూడా ఉపయోగించబోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే విదేశాల నుంచి కూడా చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక నుంచి యూపీఐ ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేయవచ్చు.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే తదితర యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తారు.

తొలి దశలో 10 దేశాలకు అనుమతి

ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.ఈ తాజా విధాన నిర్ణయం 1.35 కోట్ల మంది ఎన్నారైలకు సౌలభ్యంగా మారనుంది. తొలి దశలో 10 దేశాలకు అనుమతి తొలి దశలో ఎన్నారైలు అధికంగా ఉన్న 10 దేశాల నుంచి చెల్లింపులకు ఎన్ పీసీఐ అనుమతి మంజూరు చేసింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్కాంగ్,సౌదీ అరేబియా నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు.

విదేశాల నుంచి యూపీఐ చెల్లింపుల కోసం ఎన్ పీసీఐ(PCI) 2020లోనే ప్రత్యేకంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లోని డిజిటల్ పేమెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.

ఇప్పటికే నేపాల్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్లలోని సంస్థలు భారతీయ యూపీఏ చెల్లింపులను అనుమతించేలా ఒప్పందాలు చేసుకోగా.. మన యూపీఐని సింగపూర్ పేనౌ సంస్థతో అనుసంధానించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు నేరుగా భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులకు అనుమతించింది.

అయితే ప్రస్తుతం ఎన్నారైలు భారత్లోని బంధువులకు అక్కడి బ్యాంకు ఖాతా నుంచి భారత్లోని బ్యాంకు ఖాతాకు డబ్బును పంపిస్తున్నారు. దీన్ని వైర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ విధానంలో నగదు బదిలీకి 48 గంటల సమయం పడుతుంది.

-Advertisement-

ఇక వెస్ట్రన్ యూనియన్, యూఏఈ ఎక్స్ఛేంజ్ వంటి మనీ ట్రాన్స్ఫర్ కంపెనీల ద్వారా పంపాలంటే విదేశాల్లోని మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఆఫీసుకు వెళ్లి ఆ దేశం కరెన్సీని చెల్లించాలి. ఆ రోజుకు మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ నిర్దేశించిన మారక విలువనుబట్టి భారత్లో ఉన్న వారికి భారత కరెన్సీలో నగదు చెల్లిస్తారు.

ఆన్ లైన్ చెల్లింపు కంపెనీలు

ఇవి కాకుండా మరికొన్ని ఆన్ లైన్ చెల్లింపు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి డబ్బులు పంపేవారు, పొందేవారు ఇద్దరి నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. మనీ లాండరింగ్కు అవకాశం లేకుండా విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులపై భారత్లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కు కట్టుబడిన బ్యాంకు అకౌంట్లకే డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని స్పష్టం చేసింది.

డబ్బులు చెల్లించే ఖాతా ఉన్న బ్యాంకు, డబ్బులు తీసుకునే ఖాతా ఉన్న బ్యాంకు కచ్చితంగా విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపు లావాదేవీలు దేశంలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి అనుగుణంగా ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆర్థిక ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఎన్పీసీఐ తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకుల ద్వారా డిజిటల్ పేమెంట్లు మరింతగా పెరగనున్నాయి.దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తరువాత నుంచి తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది.

అప్పటి నుంచి ఇవి భారీగా పెరిగాయి. 2000లో దేశంలో రూ.4.2 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరగ్గా, 2022లో ఏకంగా రూ.12.8 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు మొదలైతే వీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది.

2021లో ఎన్నారైలు భారత్లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.7.15 లక్షల కోట్లు పంపించగా.. 2022లో రూ.8 లక్షల కోట్లు పంపించారు. అందులో 25 శాతం గల్ఫ్ దేశాల నుంచి,20 శాతం అమెరికా నుంచి వచ్చాయి.అయితే యూపీఐ పేమెంట్లను అనుమతించడం నిధుల వరద మరింత పెరగనుంది.

also read:

Yuvaraj: యువ‌రాజ్ అనారోగ్యం గురించి ముందుగానే గుర్తించిన స‌చిన్.. అత‌నికి ఎలా తెలిసింది…!

pimples: ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News