HomecinemaNaveen Yerneni : మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌కి అస్వ‌స్థ‌త.. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లింపు..!

Naveen Yerneni : మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌కి అస్వ‌స్థ‌త.. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లింపు..!

Telugu Flash News

Naveen Yerneni:  ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నెని అస్వస్థతకు గురైన‌ట్టు తెలుస్తుంది.. నిన్న రాత్రే ఆయన కాస్తా ఆరోగ్యం ఇబ్బందిగా అనిపించడంతో హైదరాబాద్ లోని ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్టు స‌మాచారం.

అయితే ప్ర‌స్తుతం నవీన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే గ‌త మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ యెర్నేని, రవిశంకర్ ఇళ్లతో పాటు, టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఇళ్ల‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

ఈ సోదాల కార‌ణంగానే నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యార‌ని టాక్. అయితే ఆయ‌న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో పలువురు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ‌ల మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించ‌గా, ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అలానే ‘ఖుషి’ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఎన్టీఆర్31’, ‘ఆర్సీ16’ కూడా రూపుదిద్దుకుంటున్నాయి.

also read :

Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమైందా? అందుకే ఆ ట్వీట్‌ చేశాడా?

-Advertisement-

Dominic Raab : బ్రిటన్‌లో సంచలనం.. డిప్యూటీ ప్రధాని రాజీనామా

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News