Telugu Flash News

meridian restaurant news : మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత

meridian restaurant news

meridian restaurant news : హైదరాబాద్ – పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో  ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లియాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేసిన ఘటన లో లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన పెద్ద దుమారం లేపింది. అయితే అక్కడకి పోలీసులు వచ్చిన కూడా వారు వినకపోవడం అలాగే కొట్టుకోవడం జరిగింది.

ఈ విషయం పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్ సీరియస్ అయ్యారు. మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేతకు ఆదేశాలు జారీచేసారు. మరియు తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్, శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

also read :

పెరుగు అడిగితే చంపేశారు..

Exit mobile version