HomecinemaMeena: ఐశ్వర్యారాయ్‌ని చూసి తొలిసారి అసూయ క‌లిగింద‌న్న మీనా

Meena: ఐశ్వర్యారాయ్‌ని చూసి తొలిసారి అసూయ క‌లిగింద‌న్న మీనా

Telugu Flash News

Meena: చూడ‌చ‌క్క‌ని రూపం, ఆక‌ట్టుకునే అభిన‌యం మీనా సొంతం. శివాజీ గణేషన్‌ యాక్ట్ చేసిన చాలా సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్‌తోనూ రెండు సినిమాలు చేసింది. దాదాపు 50 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి స్టార్‌డ‌మ్ పొందిన మీనా.. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘నవయుగం’ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. అదే ఏడాది తమిళంలోనూ ఫిమేల్ లీడ్‌గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ‘సీతారామయ్యగారి మనవరాలు’, కోలీవుడ్‌లో ‘ఒరు పుదియ కాదల్’ సినిమాలు మీనాకు మంచి బ్రేక్ ఇవ్వ‌డంతో వ‌రుస అవ‌కాశాలు అందాయి.

అంత‌గా ఆక‌ట్టుకుందా..

సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా కాస్త సెలెక్టివ్ పాత్రలు ఎంచుకొని అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ‘దృశ్యం’ సినిమాలో మీనా న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. మీనా వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా రాణించింది. లక్ష్మీ, కల్యాణం, అనుబంధాలు లాంటి సీరియల్స్ లో నటించారు. రియాలిటీ షోస్ కు జడ్జిగారూ కూడా వ్య‌వ‌హ‌రించ‌గా, ‘కరొలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించి మెప్పించింది. ఇటీవ‌ల త‌న భ‌ర్త మృతి చెంద‌డంతో తీవ్ర విషాదంలో మునిగింది మీనా. ఇక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోలుకుంటుంది.

తాజాగా మీనా..ఐశ్వ‌ర్యరాయ్ గురించి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని(పొన్నియన్‌ సెల్వల్‌లో ఐశ్యర్య చేసిన క్యారెక్టర్‌) కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి అసూయ కలిగింద‌ని పేర్కొంది. నా జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి.

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ నా అభినందనలు అంటూ పీఎస్1లో ఐశ్వ‌ర్య‌రాయ్ ఫొటో షేర్ చేసింది. మ‌ణిరత్నం తెర‌కెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30 న విడుద కాగా, మొదటి రోజే దాదాపు రూ. 39 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ. 23.50 కోట్లు వసూలు చేయ‌డం విశేషం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News