Telugu Flash News

జైస‌ల్మేర్‌కి చేరుకున్న కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా.. రేపే వివాహం..!

Kiara Sidharth wedding

KiaraSidharthwedding : బాలీవుడ్ నటి, కియారా అద్వానీ, నటుడు సిద్దార్ద్ మల్హోత్రా (siddarth Malhotra) ని పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. వీరి వివాహ వేడుకలు మొదలయ్యాయి. రాజస్థాన్‌ (rajastan) లోని జైసల్మేర్‌ (jaisalmer) లోని సూర్యఘర్ ప్యాలెస్‌ (suryagarh palace) లో పెళ్లి కోసం గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పెళ్లి జరిగే మండపాన్ని వెరైటీగా డిజైన్ చేసారు. ఇక ఈ వేడుక‌కి ఇప్పటికే కియారా అద్వానీతో పాటు సిద్దార్ధ్ మల్హోత్రా కుటుంబ సభ్యులంతా జైసల్మేర్‌కు చేరుకున్నారు. ప్యాలెస్‌లో వారికి కేటాయించిన సూట్‌ రూమ్‌లలో లగేజీతో పాటు దిగిపోయారు.

పెళ్లిలో నూతన వధువరుల బంధువులు మొత్తం 150 మంది వరకు ఉండవచ్చని తెలుస్తోంది. వీరితో పాటు బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన మరికొందరు సెలబ్రిటీలు ఈ మ్యారేజ్ ఫంక్షన్‌కు అటెండ్ అవుతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ జరిగే పెళ్లి కోసం కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా సూర్యాఘర్‌ ప్యాలేస్‌లో తమకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో రెడీ అవుతారు. పంజాబీ సంప్రదాయంలో వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరిపే విధంగా ఇరు కుటుంబ సభ్యులు ప్యాలేస్‌ను అలంకరిస్తున్నారు.

also read:

Horoscope (05-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

tomato sauce : ఆరు నెలలు నిల్వ ఉండేలా టమాటా సాస్‌ తయారు చేసుకోండి

Jaggery face pack : బెల్లంతో ముఖంపై ముడతలు ఇలా పోగొట్టుకోండి..

 

Exit mobile version