Telugu Flash News

Kantara : కాంతార హ‌వా మాములుగా లేదు.. మ‌రో అరుదైన అవార్డ్‌

kantara movie

Kantara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార సినిమా ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు .16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇదే కాదు ఆస్కార్ అంచు వరకూ వెళ్లి వచ్చింది కాంతారా. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సాధించింది.

అద్భుత నటన ప్రదర్శించి.. దర్శకత్వంలో టాలెంట్ చూపించిన రిష‌బ్ శెట్టి దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు. అంతే కాదు ప్రధాని కోసం ఏర్పాటు చేసిన విందులో కూడా రిషబ్ శెట్టి పాల్గొనే అవకాశం కల్పించారు.

రీసెంట్ గా కర్ణాటక పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు పలువురు కన్నడ సినీ ప్రముఖులతో కలిసి రిషభ్ హాజరయ్యాడు. విందులో పాల్గొన్న వారిలో యష్, విజయ్ కిరంగదూర్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ తో పాటు కొంత మంది సెలబ్రీటీలు పాల్గొని సంద‌డి చేశారు.

ఇక కాంతార సినిమాకు సీక్వెల్ కూడా ఉంది అని ప్రకటించిన హీరో.. 2024లో ఈ మూవీ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కెజియఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సీక్వెల్ రూపొందించ‌నుంది.

also read :

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

Exit mobile version