HomecinemaAccident: రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన క‌మెడీయ‌న్ పెద్ద కుమారుడు

Accident: రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన క‌మెడీయ‌న్ పెద్ద కుమారుడు

Telugu Flash News

Accident: టాలీవుడ్ పాపుల‌ర్ కమెడీయ‌న్స్‌లో గీతా సింగ్ ఒక‌రు. ఆమె ఎవడిగోల వాడిదే, కితకితలు లాంటి సినిమాలతో ఎంతో పాపుల‌ర్ అయింది. వ‌రుస సినిమా ఆఫ‌ర్స్‌తో కొన్నాళ్లు బిజీగా కూడా ఉంది. అప్పుడ‌ప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌లు చేస్తున్న గీతా సింగ్ ఇంట్లో ఇప్పుడు విషాదం నెల‌కొంది.

జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ నెట్టుకొస్తున్న గీతా సింగ్.. తన అన్నయ్య కుమారులను దత్తత తీసుకొని పెంచుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదంలో కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం.

ఈ విష‌యం తెలిసిన ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన పెద్ద‌లు ఆమెకు ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. కాగా, గీతా సింగ్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ముఖ్యంగా ఈమెకు దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేక ఇబ్బంది పడుతున్న గీతా సింగ్‌కి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి.

also read :

Immunity Boosting Fruits : రోగ నిరోధక శక్తి పెంచే 5 పండ్లు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News