Telugu Flash News

Directors: ఇద్దరు టాప్ ద‌ర్శ‌కుల‌కి ప్ర‌మాదాలు… టెన్ష‌న్‌లో అభిమానులు

Directors: సాధార‌ణంగా హీరోలు షూటింగ్స్‌లో గాయ‌ప‌డుతుండ‌డం త‌ర‌చుగా మ‌నం వింటుంటాం. కాని ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్స్ గాయాల బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ముందుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదం విష‌యానికి వ‌స్తే… హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో షూటింగ్ చేస్తుండ‌గా ఆయ‌న గాయాలపాలు అయినట్టు తెలుస్తుంది. రోహిత్‌ని వెంట‌నే ల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ఇన్ఫార్మేషన్ రాలేదు.

సిద్థార్ధ్ మల్హోత్ర హీరోగా..రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ఓ వెబ్ మూవీ తెరకెక్కుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా ఎస్పీ కబీర్ మాలిక్ పాత్రలో నటిస్తుండగా శిల్పా శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే వివేక్ ఓబెరాయ్ ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఈనెల 5 నుంచి హైదరాబాద్ లో మకాం వేశారు టీమ్. రోహిత్ శెట్టి దర్శకులు మరియు స్టంట్ మాస్టర్ కూడా. ఈక్రమంలోనే… ఓ కార్ చేజింగ్ సీన్ ను తెరకెక్కిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈసినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ ప్లేన్ చేస్తోన్న సమయంలో అనుకోకుండా గాయపడ్డారు సురేందర్ రెడ్డి. ఈ ప్రమాదంలో దర్శకుడి కాలికి తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ చేసి కాలుకు కట్టుకూడా కట్టారు. అంతే కాదు నడవలేని స్థితిలో వీల్ చైర్ లో సురేందర్ రెడ్డి ఉన్నాడు. అయితే హాస్పిటల్ నుంచి సరాసరి షూటింగ్ స్పాట్ కు వచ్చేశాడు సురేందర్ రెడ్డి.పనిపై తనకున్న డెడికేషన్ ను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version