Homebigg boss telugu season 6Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో వేడెక్కిన వాతావ‌ర‌ణం.. కొట్టుకుంటారా అని భ‌య‌ప‌డుతున్న ప్రేక్ష‌కులు

Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో వేడెక్కిన వాతావ‌ర‌ణం.. కొట్టుకుంటారా అని భ‌య‌ప‌డుతున్న ప్రేక్ష‌కులు

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం రోజురోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా, వారిలో ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా ప్ర‌స్తుతం 19 మంది ఉన్నారు. వీరి మ‌ధ్య గేమ్ ఆస‌క్తిగా న‌డుస్తుంది.

అయితే తాజా ఎపిసోడ్‌లో నామినేష‌న్స్ గురించి ప్ర‌స్తావిస్తూ రేవంత్ వ్యాఖ్య‌ల‌పై చాలా ఫీలైంది నేహా చౌద‌రి. ఇక రివ్యూలు ఇచ్చే ఆదిరెడ్డి, గీతులు పక్క పక్కన కూర్చుని ముచ్చట్లు పెట్టారు. ఈ ఇనయ ఏంటబ్బా తిక్క దెయ్యం అని గీతు అన‌గా, ఆమె గురించి వేస్ట్ వరస్ట్.. మాట్లాడటం తెలియదు.. అని ఆదిరెడ్డి అన్నాడు.

ఇక బిల్డ‌ప్ రాణి శ్రీ స‌త్య‌ గేమ్ ఆడ‌కపోయినా బిల్డప్ మాటలు త‌న ద‌గ్గ‌ర ట‌న్నులు ట‌న్నులు ఉన్న‌ట్టుగా చెప్పుకొస్తుంది.

ర‌చ్చ ర‌చ్చ‌…

ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యుల్ని పోలీసులు, దొంగలుగా రెండు గ్రూప్‌లు చేశారు బిగ్ బాస్. ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్‌లు పోలీసులు కాగా.. దొంగల టీం సభ్యులుగా రేవంత్, ఆరోహి, సుదీప, వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్‌లు ఉన్నారు.

అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గీతూని ఎంపిక చేశారు. దొంగ‌ల హెడ్‌గా సూర్య‌, పోలీస్ హెడ్‌గా ఆది రెడ్డి ఉన్నారు. ఈ టాస్క్‌లో పోలీసులు అడవిలోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువుల్ని దొంగిలించడంతో పాటు వాటిని పోలీసులు కాపాడుకోవాలి.. టాస్క్ ఇచ్చారు.

గీతూకి వ్యాపారిగా ఇవ్వ‌డంతో ఆమె టాస్క్ మొద‌లు పెట్టింది. దొంగలు మాదిరిగానే మనం కూడా బొమ్మల్ని దాచిపెట్టకొని బోల్తా కొట్టించేలా స్కెచ్ వేశాడు ఆది రెడ్డి.. ఇక పోలీస్‌లకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తానని.. దొంగల టీంలో ఉన్న ఫైమాతో డీల్ కుదుర్చుకుంది ఆరోహి.

-Advertisement-

ఇక టాస్క్ మొత్తం ఫిజికల్ ఎటాక్‌గా మారింది. బొమ్మ‌ల విష‌యంలో ఇన‌య్.. శ్రీహాన్‌తో గ‌ట్టిగానే గొడ‌వ పెట్టుకుంది. ఇనయ నోరు జారడంతో.. ఎయ్ వాడు వీడు ఏంటి అంటూ శ్రీహాన్ రెచ్చిపోయాడు. మధ్యలో రేవంత్ వచ్చి.. మొన్న నన్నుకూడా అన్నది చెత్తది.. అప్పుడు కొట్టేద్దాం అనుకున్నా అంటూ తెగ రెచ్చిపోయాడు.

అయితే శ్రీహాన్‌ని వాడు అన్నందుకు సారీ చెప్పింది ఇనయ. శ్రీహాన్, రేవంత్‌లు తమ దగ్గర ఉన్న బొమ్మల్ని గీతుకి అమ్మి డ‌బ్బులు సంపాదించారు. అయితే గ‌తంలో క‌న్నా ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు తమ బుర్ర‌ల‌కు ప‌దును పెట్టి గేమ్ ఆడుతున్నారు. దీంతో గేమ్ ఆస‌క్తిక‌రంగానే సాగుతుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News