HomecinemaAshu Reddy Drugs Case : టార్చర్ అనుభవిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయొద్దు..

Ashu Reddy Drugs Case : టార్చర్ అనుభవిస్తున్నా.. తప్పుడు ప్రచారం చేయొద్దు..

Telugu Flash News

Ashu Reddy Drugs Case : డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో టాలీవుడ్ మరోసారి షాక్‌కు గురైంది. తన కాల్ లిస్టులో పలువురు సినీ ప్రముఖుల నంబర్లను గుర్తించారు. ఈ జాబితాలో సినీ తారలు ఆశు రెడ్డి, సురేఖా వాణి, జ్యోతిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆశు రెడ్డి మరోసారి మాట్లాడుతూ.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇదివరకే చెప్పినా.. రెండు రోజులుగా తన పేరు, ఫోన్ నంబర్ అంటూ పలు వార్తా ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నాకు వందల సంఖ్యలో కాల్స్ చేశారని వాపోయింది. మీడియాలో వస్తున్న వార్తల వల్ల రెండు రోజుల నుంచి మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నానని చెప్పింది.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆశూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నంబర్ ఇవ్వడంతో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పింది. దురదృష్టకర పరిస్థితుల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. తన పరువు తీసేలా కథనాలు ప్రసారం చేసిన మీడియా ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది. రెండు నెలల నుండి షూటింగ్ పనులపై ఇతర దేశాలలో ఉన్నట్టు చెప్పింది. తమకు కెరీర్ ఉందని, తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.

read more news:

Drugs Case : టాలీవుడ్ లో కలకలం.. స్పందించిన ఆషూ రెడ్డి, జ్యోతి, సురేఖావాణి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News