Telugu Flash News

kallakurichi | కళ్ళకురిచి రమణి హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

kallakurichi

కళ్ళకురిచి (kallakurichi) లో జరిగిన రమణి హత్య కేసు (ramani murder case) లో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అశోక్‌ హత్య చేసినట్లు అనుకున్న ఈ కేసులో పోలీసు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణలో తేలిన విషయాల ప్రకారం, హత్యకు గల కారణం భార్య రమణికి తిరునావలూర్‌ ఎస్‌ఐ నందగోపాల్‌తో వివాహేతర సంబంధం ఉండటమే. ఈ విషయం తెలుసుకున్న భర్త అశోక్‌ రమణితో గొడవ పడి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ విషయం తేలిన తర్వాత ఎస్‌ఐ నందగోపాల్‌పై శాఖాపరమైన విచారణ జరిపి, అతన్ని సస్పెండ్‌ చేశారు. అంతేకాకుండా, కళ్ళకురిచిలో పనిచేసే సమయంలో రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలపై విళుపురం జిల్లా మరక్కాణం హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకరన్‌ను కూడా సస్పెండ్‌ చేశారు.

 

Exit mobile version